దుర్గాష్టమి విశిష్టత : మహా శక్తి శాలిని త్రిముఖ దుర్గాదేవి

Oct 24, 2020, 8:01 AM IST

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మొదలయ్యే దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను కానీ, అమ్మవారి ఆలయాలను కానీ సందర్శించాలని పండితులు చెబుతున్నారు. అలాంటి ఓ అమ్మవారి పీఠమే ఈ భైరవ కోన త్రిముఖ దుర్గాదేవి పీఠం. ఇక్కడ ప్రత్యింగరా మహాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇది ప్రకాశం జిల్లా, పామురు మండలం, హనుమన్ గిరి సంస్థానానికి సంబంధించిన పీఠం. ఇది విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఐదవ వారసుడైన దక్షిణామూర్తి మరో అవతారానికి సంబంధించిన పీఠం. Pratyangira devi sharan navaratri celebrations