శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

Jan 22, 2021, 12:12 PM IST

జనసేన చీఫ్, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ రెండో పర్యటన శుక్రవారంనాడు కొనసాగుతోంది. తిరుపతి లోకసభ సీటులో తామే పోటీ చేస్తామంటూ ఆయన బిజెపికి సంకేతాలు ఇస్తున్నారు. తిరుపతి పట్టు బిగించే వ్యూహంలో భాగంగా ఆయన పర్యటన సాగుతున్నట్లు కనిపిస్తోంది.