నిమ్మకూరులో బాలయ్య సందడి..

Jun 17, 2020, 12:05 PM IST

కృష్ణా జిల్లా, నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ  పర్యటించారు. నిమ్మకూరులోని తన బంధువులను కలవటానికి వచ్చిన బాలకృష్ణ అక్కడి ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.