శబరిమల: తెరుచుకొన్న అయ్యప్ప ఆలయం, భారీ బందోబస్తు

By narsimha lodeFirst Published Nov 5, 2018, 6:15 PM IST
Highlights

కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని  సోమవారం నాడు తిరిగి తెరిచారు.  

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని  సోమవారం నాడు తిరిగి తెరిచారు.  అయ్యప్పకు  మకరవిలక్కు పూజల కోసం ఈ ఆలయాన్ని  తెరిచారు. 

శబరిమల ఆయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని  కేరళ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు గత మాసంలో  ఐదు రోజుల పాటు శబరిమల ఆలయాన్ని తెరిచారు.ఈ ఆలయంలో ప్రవేశం కోసం  మహిళలు ప్రయత్నించారు. అయితే  సంప్రదాయవాదులు మాత్రం  మహిళల ప్రవేశాన్ని అడ్డుకొన్నారు.

అయితే గత నెలలో ఐదు రోజుల పాటు  ఆలయం తెరిచిన సమయంలో  మహిళల  ప్రవేశం కాకుండా అడ్డుకొన్నారు సంప్రదాయవాదులు. ఇదిలా ఉంటే  మరోవైపు ఈ మాసంలో  మకరవిలక్కు పూజల కోసం సోమవారం నాడు  శబరిమల ఆలయాన్ని తెరిచారు. రేపటి రాత్రి ఆలయాన్ని మూసివేయనున్నారు.

అయితే ఈ పరిస్థితుల్లో శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు ప్రవేశించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సంప్రదాయవాదులు  సిద్దంగా ఉన్నారు.దీంతో శబరిమల ఆలయం సమీపంలో  వెయ్యికి మందికి పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు.వంద మంది మహిళ కానిస్టేబుళ్లతో రెండు కమెండో టీములను  ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

శబరిమల హోటళ్లలో మహిళలు.. గవర్నర్‌కు ఎమ్మెల్యే లేఖ

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమలలో మహిళల ప్రవేశం.. రివ్యూ పిటిషన్‌పై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి
 

 

click me!