చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్... నాసా ప్రకటన

By telugu teamFirst Published Sep 27, 2019, 9:36 AM IST
Highlights

ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలి పోయింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా ప్రకటించింది. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు నాసా గుర్తించింది.
 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపై కి పంపింన చంద్రయాన్-2 విఫలమయ్యింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలి పోయింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా ప్రకటించింది. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు నాసా గుర్తించింది.

కాగా... విక్రమ్ జాడ ఇప్పటికీ గుర్తించలేకపోయామని నాసా తెలిపింది. ఈ మేరకు నాసా తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నాసా ట్వీట్ లో పేర్కొంది. 

జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా భూ కేంద్రంతో దానికి సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాగా... ఇస్రోకి సపోర్ట్ చేయడానికి నాసా కూడా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాసా జరిపిన పరిశోధనలో ఈ విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు తేలింది.

Our mission imaged the targeted landing site of India’s Chandrayaan-2 lander, Vikram. The images were taken at dusk, and the team was not able to locate the lander. More images will be taken in October during a flyby in favorable lighting. More: https://t.co/1bMVGRKslp pic.twitter.com/kqTp3GkwuM

— NASA (@NASA)  

 

click me!