Published : Jun 05, 2025, 09:19 AM ISTUpdated : Jun 05, 2025, 10:44 PM IST

Telugu news live updates: Bengaluru stampede - ఆర్సీబీ, కేఎస్‌సీఏ ప్రతినిధుల అరెస్టుకు సీఎం ఆదేశాలు

సారాంశం

గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాజీవ్‌ యువవికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్ష, కాళేశ్వరం విజిలెన్స్ తో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక తెలంగాణ హ్యుందాయ్ రూ. 8 వేల కోట్లకి పైగా పెట్టుబడులు పెట్టనుంది. అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాటతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

CM Siddaramaiah addresses a press conference following the stampede

10:44 PM (IST) Jun 05

Bengaluru stampede - ఆర్సీబీ, కేఎస్‌సీఏ ప్రతినిధుల అరెస్టుకు సీఎం ఆదేశాలు

Bengaluru stampede: బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. ఆర్సీబీ, కేఎస్‌సీఏపై కేసు నమోదుతో పాటు వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, పోలీస్ అధికారుల సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చారు.

Read Full Story

10:06 PM (IST) Jun 05

Holiday - జూన్ 6న ప‌బ్లిక్ హాలీడే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Holiday: జూన్ 6ను జాతీయ సెలవుగా ప్రకటించారని ప్రచారం సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది.

Read Full Story

08:38 PM (IST) Jun 05

RCB - బెంగళూరు తొక్కిసలాట బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ

RCB: బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Read Full Story

07:54 PM (IST) Jun 05

Maganti Gopinath - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పరిస్థితి విషమం

Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

Read Full Story

07:09 PM (IST) Jun 05

RCB - విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. ఆర్సీబీపై కేసు నమోదు

RCB: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట క్రమంలో ఆర్సీబీ (RCB), కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA)పై క్రిమినల్ నిర్లక్ష్యానికి సంబంధించి ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

Read Full Story

06:37 PM (IST) Jun 05

Mahua Moitra - 65 ఏళ్ల వ్యక్తితో మహువా మోయిత్రా సీక్రెట్ పెళ్లి.. ఎవరీ పినాకీ మిశ్రా?

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) నేత పినాకీ మిశ్రా మే 3న జర్మనీలో వివాహం చేసుకున్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. అయితే, అధికారికంగా ధృవీకరణ ఇంకా లేదు.

Read Full Story

05:55 PM (IST) Jun 05

Mahua Moitra - జర్మనీలో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా మరో సారి వార్తల్లో నిలిచారు. జర్మనీలో మే 3న ఆమె పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Read Full Story

05:16 PM (IST) Jun 05

Pawan Kalyan - చెట్లే మనిషి ఆనవాళ్లు.. వన మహోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న వన మహోత్సవంలో 5 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రకటించారు.

Read Full Story

04:23 PM (IST) Jun 05

Builderai - 700 మంది ఇంజనీర్లతో ఏఐ మాయ.. బిల్డర్.ఏఐ ఇంత మోసం చేసిందా

Builder ai: బిల్డర్.ఏఐ చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఏఐ మోసాలు సహా తీవ్ర ఆరోపణల మధ్య దివాళా ప్రకటన చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

03:24 PM (IST) Jun 05

UPI - ఫోన్‌పేలో ఎక్కువ సార్లు బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.? మార‌నున్న నిబంధ‌న‌లు..

దేశంలో యూపీఐ సేవ‌లు భారీగా విస్త‌రిస్తున్నాయి. ప్ర‌తీ చిన్న లావాదేవీకి ఫోన్‌పే, గూగుల్‌పేల‌ను ఉప‌యోగిస్తున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్స్ సేవ‌ల్లో నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించేందుకు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Read Full Story

02:30 PM (IST) Jun 05

Private gold mining - బంగారం బాబోయ్ బంగారం.. ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌. ఎక్క‌డో తెలుసా?

సాధార‌ణంగా గోల్డ్ మైనింగ్ అంటే ఎక్క‌డో విదేశాల్లో జ‌రుగుతుంద‌ని అనుకుంటాం. అయితే భార‌త్‌లో అదికూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బంగారు గ‌నులు ఉన్నాయంటే న‌మ్ముతారా.? దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన తొలి గోల్డ్ మైనింగ్‌కు సంబంధించిన క‌థ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

12:44 PM (IST) Jun 05

Digital census - స్వ‌తంత్ర భార‌త‌దేశంలో తొలిసారి.. డిజిట‌ల్ జ‌న‌గ‌ణ‌న ఎప్ప‌టినుంచంటే

భారతదేశంలో జనాభా లెక్కలు 16 ఏళ్ల విరామం తర్వాత 2027 మార్చి 1 నాటికి పూర్తయ్యేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్ 4న (2025) ప్రకటించింది. ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటి డిజిటల్ జనగణన కావడం విశేషం.

Read Full Story

12:09 PM (IST) Jun 05

Pakistan - పాక్ నాయకుడి నోరు మూయించిన ఈజిప్ట్ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే

పహల్గాం దాడిని భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి ఉపయోగిస్తున్నారనే బిలావల్ భుట్టో వ్యాఖ్యలను ఈజిప్ట్ జర్నలిస్ట్ ఖండించారు. 

Read Full Story

11:25 AM (IST) Jun 05

RCB Stampede: ఈ విషాదానికి ఎవ‌రు కార‌ణం.? వెంటాడుతోన్న ప్ర‌శ్న‌లివే..

ఆర్సీబీ విజ‌యోత్స‌వ ర్యాలీలో జ‌రిగిన విషాదం యావ‌త్ దేశాన్ని కుదిపి వేసింది. అభిమాన క్రికెట‌ర్ల‌ను చూడాల‌నుకున్న వారు తిరిగి రాని లోకాల‌కు వెళ్లారు. దీంతో ఇప్పుడీ అంశం చుట్టూ ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 

 


More Trending News