ముగ్గురమ్మాలను మోసం... భర్తను తాళ్లతో కట్టేసి నడిరోడ్డుపై చితకబాదిన మహిళ

First Published Sep 2, 2020, 2:07 PM IST

 అమ్మాయితో సహజీవనం చేస్తున్న భర్తని బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది మొదటి భార్య. 

కరీంనగర్: ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఓ నిత్య పెళ్ళికొడుకుకి కట్టుకున్న భార్యే నడిరోడ్డుపై దేహశుద్ది చేసింది.భార్య, ఓ బిడ్డ వుండగా ఇద్దరు అమ్మాయిలని ప్రేమపెళ్ళి చేసుకుని మోసం చేసిన అతడు తాజాగా మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. దీంతో అతడి ఆటకట్టించి మరోసారి ఇలాంటి పనులు చేయకుండా వుండేలా కట్టుకున్న భార్యే అతడిని నడి రోడ్డుపై కొట్టింది.
undefined
కరీంనగర్ అమ్మాయితో సహజీవనం చేస్తున్న భర్తని బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది మొదటి భార్య. ఒకటికాదు రెండుకాదు నాలుగుపెళ్ళిళ్ళు చేసుకొని గుట్టుచప్పుడుగా కాపురాలు చేస్తూ తననే కాదు ఆ అమ్మాయిలందరిని మోసం చేస్తున్నాడని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
undefined
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కి చెందిన సంపత్ కి మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో కొన్నేళ్లక్రితం వివాహంజరిగింది. ఈ దంపతులుకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
undefined
అయితే సంపత్ కట్టుకున్న భార్య, కన్న కొడుకు వున్నాడని మరిచి అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేయడం ప్రారంభించాడు. ఇలా ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను ప్రేమపేరుతో మోసం చేశాడు. అమ్మాయిలని వాడుకొని గర్భం చేసి వదిలేయడమే పనిగా పెట్టుకున్నాడు.
undefined
ఇద్దరు అమ్మాలను ఇలాగే మోసం చేసిన అతడు ఇటీవలె మరో అమ్మాయితో సహజీవనం ప్రారంభించాడు. కరీంనగర్ లోని భారత్ థియేటర్ వద్ద ఓ గదిని అద్దెకి తీసుకొని సహాజీవనం చేస్తున్నాడు.
undefined
అయితే గత కొద్దిరోజులుగా సంపత్ వ్యవహారంపై అనుమానం రావడంతో నిఘా పెట్టిన భార్యకు అతడి వ్యవహారం గురించి తెలిసింది. దీంతో ఆమె తన బంధువులతో కలిసి ఈ రోజు ఉదయం భర్త మరో మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ఇలా పట్టుబడ్డ అతడి చేతులని కట్టేసి చితకబాదిన వారు ఈ నిత్యపెళ్లి కొడుకును పోలిసుస్టేషన్ లో అప్పగించారు.
undefined
click me!