ఈ నేపథ్యంలో రామ్ రూట్ మార్చాడు. యాక్షన్ సినిమాలు, రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు రామ్. ఇప్పుడు ఎంటర్టైనింగ్ సినిమాలతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
`మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంతో మహేష్ బాబు దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఈ మూవీ కూడా మంచి ఆదరణ పొందింది. కామెడీ ఎంటర్ టైనర్గా ఆకట్టుకుంది. ఇప్పుడు రామ్కూడా అలాంటి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆడియెన్స్ ముందుకు రావాలనుకుంటున్నారట.