రజినీ కాంత్ ని భయపెట్టిన చిరంజీవి, మోహన్ బాబు... అందుకే నో పాలిటిక్స్!

First Published Dec 30, 2020, 8:54 PM IST

నిన్న రజినీకాంత్ చేసిన ప్రకటన ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేసింది. ఇకపై నో పాలిటిక్స్... పార్టీ పెట్టడం లేదని ఆయన సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేశారు. రజినీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆరోగ్య సమస్యలు మరియు దేవుడు నిర్ణయం సాకులుగా చూపించారు. అయితే రజినీకాంత్ రాజకీయ వెనకడుగు వేయడానికి కారణం చిరంజీవి, మోహన్ బాబే అనే కొత్తవాదన తెరపైకి వచ్చింది.

రెండు దశాబ్దాల క్రితమే ఫ్యాన్స్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. రజినీకాంత్ మాత్రం ఈ విషయంలో తొందరపడలేదు. అప్పుడప్పుడు సినిమాలలో అభిమానుల ఆశలకు సమాధానంగా... దేవుడు ఆదేశించినప్పుడు తప్పకుండా వస్తానంటూ డైలాగ్స్ పేల్చేవాడు.
undefined
ఫ్యాన్స్ నుండి ఈ డిమాండ్ మరింత ఉధృతం అయ్యింది. రజినీరాజకీయాల్లోకి రావాలనిఅభిమానులు నిరసనలుచేసే స్థాయికి వెళ్లారు. దీనితో రజినీకాంత్ 2017లో తాను రాజకీయాలలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అలాగే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోఅన్ని నియోజక వర్గాలలోపోటీ చేయనున్నట్లు ప్రకటించలేదు.
undefined
పాలిటిక్స్ లోకివస్తానని చెప్పిన రజినీ.. ఆ విషయాన్నిపెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఆయన పార్టీ స్థాపన, దాన్ని బలపరచడం వంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎప్పటిలాగే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఎన్నికలకు నెలల సమయం కూడా లేకపోగా, రజినీ కాంత్ పార్టీ ప్రకటించాలని మరలా అభిమానులుఇంటి ముందు ఆందోళనలు దిగారు.
undefined
ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని ఆయన మీడియా ముఖంగా తెలియపరిచారు. ఆ ప్రకటన జరిగిన రోజుల వ్యవధిలో రజినీకాంత్ అస్వస్థకు గురయ్యారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆయన చికిత్స అనంతరం కోలుకొని, చెన్నై చేరుకోవడం జరిగింది. ఆ తదుపరి రోజు రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా.. దేవుని ఆదేశం మేరకే పాలిటిక్స్ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ రాశారు.
undefined
ఈ నిర్ణయం ఆయన ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకుచేసింది. హైదరాబాద్ టూర్ తరువాత రజినీకాంత్ తీసుకున్న ఈ సడన్ డెసిషన్ వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న మాట వినిపిస్తుంది. టాలీవుడ్ లో రజినీ కాంత్ కి బాగా సన్నిహితులైన చిరంజీవి,మోహన్ బాబు... ఆయన మనసు మార్చివేశారన్న వాదన మొదలైంది.
undefined
రాజకీయాలలోకి వస్తే ఎదురయ్యే ఆటుపోట్లు, విమర్శలు ఒకెత్తయితే... విజయం అందపోతే అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారట. దానికి చిరంజీవి తన పొలిటికల్ కెరీర్ ని ఉదాహరణగా చూపించారట. 70ఏళ్ల వయసులో రాజకీయ మీటింగులు, ప్రచారాలు తనకు మంచివి కాదని హితవు పలికారట.
undefined
వీళ్ల మధ్య ఓ రహస్య భేటీ జరుగగా.. చిరంజీవి, మోహన్ బాబు మీకు రాజకీయాలు వద్దని ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారట. రాజకీయాలలోకి వస్తే ఎదురయ్యే పరిణామాలు కూలంకషంగా తెలుసుకున్న రజినీ కాంత్ వాళ్ళ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.
undefined
మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ... సౌత్ ఇండియాలో హాట్ న్యూస్ గా మారింది. మరో వైపు రజినీ కాంత్కుటుంబ సభ్యులకోరిక మేరకు, అలాగే సర్వే రిపోర్ట్స్ ఆధారంగాపాలిటిక్స్ నుండి వైదొలిగాడన్న మరో వార్త కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.
undefined
click me!