బుల్లితెర సంచలనం ఉదయభాను రీ ఎంట్రీ, ఐదు పదుల వయస్సులో ఏమాత్రం తగ్గని జోరు..

First Published Jan 17, 2024, 6:47 PM IST

రీ ఎట్రీతో బుల్లితెరను షేక్ చేయడానికి రెడీ అవుతోంది యాంకర్ ఉదయభాను. ప్రోమోతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టించిన సీనియర్ బ్యూటీ.. ఐదు పదుల వయస్సు దాటినా గ్లామర్ విషయంలో . ఏమాత్రం తగ్గేది లేదంటోంది. 
 

ఒకప్పుడు తెలుగులో స్టార్ యాంకర్ అంటే ఉదయ భాను మాత్రమే కనిపించేది. ఆమెకనిపిస్తే చాలు కుర్ర కారు ఉర్రూతలూగేవారు. అప్పట్లోనే హాట్ హాట్ గా డ్రెస్ లు వేస్తూ..  స్పైసీ స్పైసీ గా మాట్లాడుతూ..  కుర్రాళ్లను కట్టిపడేసేది.  ప్రతీ షోను  ను తన ఇమేజ్ తో సక్సెస్ చేసేది ఉదయ భాను. ఇప్పుడంటే మనం స్టార్ యాంకర్ గా సుమను ఆకాశానికి ఎత్తుతున్నాం కాని.. ఒకప్పుడు బుల్లి తెరను ఏలియన యాంకర్  మహారాణి  ఉదయభాను మాత్రమే. 

Bigg boss 6

అప్పటి వరకూ ఎవరూ చేయలేని.. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పని ఉదయ భాను చేసింది. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ షో అద్దిన ఉదయ భాను కోసమే షోలను ఆడియన్స్ ప్రత్యేకంగా  చూసేవారు అంటే.. ఆమె ఎంత పాపులారిటీ సంపాధించుకుందో తెలుస్తుంది. ఉదయభాను సక్సెస్ ఫుల్ గా షోలు చేసేప్పుడు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లు పెద్దగా యాక్టీవ్ గా లేవు.. ఉండి ఉంటే.. ఆమె ఇప్పటికీ లైమ్ లైన్ లోనే ఉండేవారేమో.. 
 

Latest Videos


ఉదయభాను అంటే నిన్నటి తరం బుల్లితెర ప్రేమికులకు  బా‌గా తెలిసిన పేరు. ఒకప్పుడు యాంకరింగ్‌కు  మరో మీనింగ్ లా ఉండేది బ్యూటీ.. కాని ఆమె జీవితంలో అనుకోని ఇబ్బందులు.. కష్టాలు.. కెరీర్ కు బ్రేక్ ఇచ్చేలా చేశాయి. అంతే కాదు..  పెళ్లి చేసుకున్న తరువాత టీవీ ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇక ఇన్నాళ్లకు  ఆమె మళ్లీ బుల్లితెర అభిమానులను పలకరించేందుకు రెడీ అయ్యింది. 
 

ప్రముఖ ఛానెల్ లో ఆమె సూపర్ జోడీ అనే డ్యాన్స్ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు టీమ్. దాంతో అప్పటి ఉదయభాను ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఉదయ భాను వయస్సు 51 ఏళ్ళు.. అయినా ఏమాత్రం తగ్గనంటోంది బ్యూటీ. 

ఈ జనరేషన్ వారికి కూడా కళ్ళు కుళ్లు కునేలాఅందాలు ఆరబోస్తూ... సందడి చేయబోతోంది.  ఈ నెల 28 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుందని, గోల్డెన్ లేడీ ఉదయభాను ప్రోమో అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఉదయభాను తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ఆపొద్దు అమ్మా’ అని తన పిల్లలు చెప్పడంతో సూపర్ జోడీ ప్రోగ్రాంతో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వెల్లడించారు.

 ఇక ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకరింగ్ తో పాటు.. సీనియర్  హీరోయిన్  మీనా జడ్జిగా.. వ్యవహరించబోతున్నారు. మీనాతో పాటు  కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జీలుగా వ్యవహరించనున్నారు. ఇక ప్రస్తుతం ఉదయ భాను రీ ఎంట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

click me!