Kirak RP
జబర్దస్త్ షో వేదికగా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకడు. ఇతడు టీమ్ లీడర్ కూడాను. తన గురువు నాగబాబుతో పాటు జబర్దస్త్ మానేశాడు. అనంతరం ఆయన మాదిరే మల్లెమాల సంస్థ మీద విమర్శల దాడి చేశాడు. కమెడియన్స్ శ్రమ దోచుకుంటున్నారు. కనీసం మంచి భోజనం కూడా పెట్టారంటూ ఫైర్ అయ్యాడు.
జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక దర్శకుడిగా మారే ప్రయత్నం చేశాడు. ఓ మూవీ లాంచ్ చేసి మధ్యలో వదిలేశాడు. అనూహ్యంగా వ్యాపారస్తుడిగా మారి సక్సెస్ అయ్యాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కూకట్ పల్లి సమీపంలో కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఆ వ్యాపారం భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.
కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లోని మణికొండలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఇటీవల వ్యాపారం ఆంధ్రాకు కూడా విస్తరించాడు. తిరుపతిలో ఒక బ్రాండ్ ఏర్పాటు చేశాడు. దీని లాంచింగ్ కి మంత్రి రోజా, హీరోయిన్ మెహ్రీన్ రావడం కొసమెరుపు.
Kiraak RP
కాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి సెలబ్రిటీలు కూడా చూశారట. హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు చేపల పులుసు పంపినట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించాడు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకు కూడా పంపారట.
Ram Charan
వాళ్ళు తన బ్రాండ్ ప్రోమోట్ చేస్తారనే ఉద్దేశంతోనో లేక ఫీడ్ బ్యాక్ తెలియజేస్తారనో చేపల పులుసు పంపలేదు. వాళ్ళ నుండి మరలా చేపల పులుసు కావాలని ఫోన్ రావాలి. అందుకే సెలెబ్రెటీలకు చేపల పులుసు పంపినట్లు వెల్లడించాడు.
Kirak RP
కిరాక్ ఆర్పీ ప్రస్తుతం కోట్లు గడిస్తున్నట్లు సమాచారం. ప్రతి చోటా ఒక వంటశాల ఏర్పాటు చేసి రకరకాల చేపల పులుసు రెసిపీలు తయారు చేసి అమ్ముతున్నాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు.