చైతు, అఖిల్ కూడా నాకు పిచ్చెక్కినట్లు చూశారు, ఎవరూ నమ్మలేదు.. మూడు నెలలు తిరిగేసరికి..

First Published Jan 29, 2024, 6:40 AM IST

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి విడుదలై మ్యాజిక్ చేసింది.

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి విడుదలై మ్యాజిక్ చేసింది. ఈ చిత్రానికి తొలి రోజు నుంచి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ  సంక్రాంతి సీజన్ కాపాడింది. 

సంక్రాంతి పండగకి తగ్గట్లుగానే ఆ వైబ్ కనిపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రణాళికతో రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతం, నాగార్జున మాస్ గెటప్, అల్లరి నరేశ్, హీరోయిన్ ఆషిక రంగనాథ్ నా సామిరంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవడానికి కారణాలు అని చెప్పొచ్చు. 

Latest Videos


ప్రస్తుతం ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. 38 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. దీనితో నా సామిరంగ చిత్ర యూనిట్ తాజాగా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Nagarjuna

ముందుగా నాగార్జున అక్కినేని అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చాలా లేట్ గా కంఫర్మ్ చేశాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాకు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు అని నాగ్ అన్నారు. చిత్ర యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నట్లు నాగ్ తెలిపారు. సినిమా రిలీజ్ టార్గెట్ తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎవరూ ఒత్తిడి ఫీల్ అవకుండా నవ్వు ముఖాలతోనే పనిచేసినట్లు నాగార్జున అన్నారు. 

నాన్నగారి పుట్టినరోజు సెప్టెంబర్ 20న ఈ చిత్రాన్ని లాంచ్ చేశాం. ఒకవైపు నాన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ జరుగుతోంది. అప్పటి వరకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఎక్కడికి వెళుతున్నారు అని అమల అడిగింది. ఇలా మూవీ లాంచ్ ఉంది వెళ్ళాలి అని చెప్పాను. ఇలా స్టాచ్యూ లాంచ్ జరుగుతోంది కదా కాస్త ఆలస్యంగా వెళ్ళండి అని చెప్పింది. 

లేదు నేను వెళ్ళాలి.. ఎందుకంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని అని చెప్పాను. అప్పడు అమల.. పిల్లలు చైతు, అఖిల్ నాకు పిచ్చిపట్టినట్లు చూశారు. ఎవ్వరూ నమ్మలేదు. మూడు నెలల టైం కూడా లేదు ఎలా రిలీజ్ చేస్తారు అని ఆశ్చర్యపోయారు. కానీ నా టీం మాత్రం నమ్మింది. అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం అని నాగార్జున అన్నారు. కీరవాణి గారు కూడా ఒక టైం టేబుల్ వేసుకుని ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు అని అన్నారు. 

click me!