అంపైర్స్ కాల్ ఉంటుంది... అయితే అందులో చిన్న మార్పు... ఐసీసీ నిర్ణయం

First Published Apr 2, 2021, 8:39 AM IST

అంపైర్స్ కాల్ రూల్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నా... దాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల్లో కూడా అంపైర్స్ కాల్స్ రూల్ కారణంగా కొన్ని నిర్ణయాలు, భారత జట్టుకి ప్రతికూలంగా వచ్చాయి. దీంతో ఈ రూల్‌పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది...

బంతి వికెట్లను తాకుతున్నట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, ‘అంపైర్స్ కాల్’ పేరుతో నాటౌట్‌గా ప్రకటించడం సరైనది కాదని ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూడా అభిప్రాయపడ్డాడు.
undefined
అసలు ఈ అంపైర్స్ కాల్ రూల్ ఏంటో, దాని ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని భారత సారథి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి...
undefined
అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ, బోర్డు సమావేశంలో అంపైర్స్ కాల్‌ను తొలగించేది లేదని స్పష్టం చేసింది. అయితే అందులో కొన్ని మార్పులు చేస్తున్నట్టు సూచించింది...
undefined
‘ఎల్బీడబ్ల్యూ విషయంలో డీఆర్‌ఎస్ తీసుకుంటే... వికెట్లకు 50 శాతం బంతి తగులుతున్నట్టు రిప్లైలో కనిపిస్తే, ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ చేస్తూ... ‘అంపైర్స్ కాల్’గా ప్రకటించేవారు. అంటే ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇస్తే బ్యాట్స్‌మెన్ అవుట్, నాటౌట్‌గా ప్రకటించి ఉంటే నాటౌట్...
undefined
లెగ్ సైడ్, ఆఫ్ సైడ్ వికెట్ల విషయంలో పెద్దగా విమర్శలు రాకపోయినా ఎత్తు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో సమీక్షలో వికెట్ల ఎత్తును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...
undefined
‘ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు సమీక్షించేటప్పుడు సాంకేతికత సాయం తీసుకుంటాం. టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించినా, అది వికెట్లను పక్కగా తాకుతుందని కాదు... అది కేవలం టెక్నికల్‌గా వేసిన అంచనా మాత్రమే...
undefined
అందుకే టీవీ రిప్లైలో బంతి 50 శాతం కంటే తక్కువ తాకుతుంటే దాన్ని అంపైర్స్ కాల్‌గా నిర్ణయిస్తారు. అంటే ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయానికే కట్టుబడి ఉండాలని... అంతేకానీ అంపైర్ కంటే అంచనా వేసే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వడం కరెక్టు కాదు’ అంటూ తెలిపాడు ఐసీసీ కమిటీ ఛైర్మెన్ అనిల్ కుంబ్లే.
undefined
ఇప్పటిదాకా బెయిల్స్ కిందవరకు లెక్కలోకి తీసుకుని అంపైర్స్ కాల్ పరిగణించేవాళ్లు. ఇప్పుడు బెయిల్స్ పైభాగం వరకు లెక్కలోకి తీసుకుని ప్రకటిస్తారు...
undefined
అలాగే షాట్ రన్‌ను గుర్తించే బాధ్యత ఇంతకుముందు ఫీల్డ్ అంపైర్‌కి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని థర్డ్ అంపైర్‌కి అప్పగించింది ఐసీసీ...
undefined
మహిళల క్రికెట్‌లో కూడా కొన్ని రూల్స్ మార్చింది ఐసీసీ.. వన్డే మ్యాచులు టై అయితే... ‘సూపర్ ఓవర్’ ద్వారా ఫలితం తేల్చాలని నిర్ణయించిన ఐసీసీ, మహిళల వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించింది.
undefined
ఇంతకుముందు ఐసీసీ ఈవెంట్లకు 16 మందితో కూడిన జట్లను ప్రకటించేవాళ్లు. కరోనా కేసుల దృష్ట్యా, గాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని 23 మందితో కూడిన జట్టును ప్రకటించే వీలు కల్పించింది ఐసీసీ...
undefined
click me!