వివాహితతో సంబంధం.. యువకుడిని చంపి బాయిలర్‌లో తగలబెట్టిన మహిళ బంధువులు

sivanagaprasad kodati |  
Published : Oct 30, 2018, 01:42 PM IST
వివాహితతో సంబంధం.. యువకుడిని చంపి బాయిలర్‌లో తగలబెట్టిన మహిళ బంధువులు

సారాంశం

మహిళతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామానికి చెందిన గోపి మైలవరం బాలయోగి నగర్‌కు చెందిన ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 

మహిళతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామానికి చెందిన గోపి మైలవరం బాలయోగి నగర్‌కు చెందిన ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో గోపీని పిలిపించి గట్టిగా మందలించారు.

అయినప్పటికీ అతను తరచు ఆమెను కలుస్తుండటంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. గోపిని హత్య చేయాలని కుట్ర చేసిన వారు.. మిరియాల పండు, చెరుకుపల్లి రాఘవ, జమలయ్య దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో గోపి మరణించడంతో పొందుగుల సమీపంలోని ఎర్రచెరువులోని బాయిలర్‌లో మృతదేహాన్ని పడేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు.

చెరువు సమీపంలో కొద్దిరోజులుగా దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాయిలర్‌లో ఉన్న మృతదేహాన్ని కిందకు దించి గోపిదిగా నిర్థారించారు. అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమపెళ్లి, మరో మహిళతో వివాహేతర సంబంధం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

వివాహేతర సంబంధం: తప్పు తెలుసుకుని తప్పుకున్నా.. తరుముకొచ్చాడు

వదినతో వివాహేతర సంబంధం...చివరకి

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

వివాహేతర సంబంధం.. పచ్చడిబండతో భర్త తలపగలగొట్టిన భార్య

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

విశాఖలో మూడేళ్ల చిన్నారి అలేఖ్య హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

వివాహేతర సంబంధంపై తీర్పు...భార్యభర్తల మధ్య చిచ్చు

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్
 

PREV
click me!

Recommended Stories

TDP: చిన్న‌బాబుకు ప‌ట్టాభిషేకం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి లోకేష్ ముఖ్య‌మంత్రి కానున్నారా.?
Delhi CM Rekha Gupta Visit Tirumala:తిరుమల తొమాల సేవలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా | Asianet News Telugu