వీక్లీ ఎక్స్ పైరీ నేపథ్యంలో ఈ రోజున మార్కెట్లో మంచి ర్యాలీ చోటు చేసుకుంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పాజిటివ్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 874.18 పాయింట్ల లాభంతో 57,911.68 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 256.05 పాయింట్ల లాభంతో 17,392.60 వద్ద ముగిసింది.