Kangana Ranaut: పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీ కాన్వయ్ ను ఆపడంపై నటీ కంగనా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వేదికగా పంజాబ్లో జరిగింది చాలా సిగ్గుచేటు చర్య అనీ, ప్రధానమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు, భారతీయుల ప్రతినిధి, ఆయన 1.4 బిలియన్ల ప్రజల గొంతుక అని, ఆయనపై దాడి జరిగితే ప్రతి భారతీయుడిపై జరిగినట్లేనని పేర్కొంది.