టీమిండియా పర్యటనలో ఒక్క టెస్టు కూడా గెలవడం కష్టమేననే అంచనాలతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, తొలి టెస్టు మొదటే రోజే అద్భుతమైన ఆటతీరు చూపించి, భారత జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది. తొలి రోజు 89.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లాండ్... ఆట ముగిసే సమయానికి 263 పరుగులు చేసి మంచి పటిష్ట స్థితిలో ఉంది. మొదటి రోజు ఆఖరి ఓవర్లో టీమిండియాకి మూడో వికెట్ దక్కడం విశేషం. రెండో రోజు ఎంత త్వరగా ఇంగ్లాండ్ను ఆలౌట్ చేయగలిగితే, భారత జట్టుకి అంత మంచిదే. లేదంటే ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించి, ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్...
వందో టెస్టు ఆడుతున్న జో రూట్...
అక్షర్ పటేల్కి గాయం... రాహుల్ చాహార్, షాబజ్ నదీమ్ జట్టులోకి...
కుల్దీప్ యాదవ్కి మరోసారి తప్పని నిరాశ...