మూడో టెస్టులో తొలిసారిగా టీమిండియా ఓ సెషన్లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. తొలి సెషన్ ఆఖరి బంతికి కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన భారత జట్టు, లంచ్ బ్రేక్ తర్వాత వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసి ఆకట్టుకునే పర్పామెన్స్ ఇచ్చింది. అయితే టీ బ్రేక్ తర్వాత రోహిత్ శర్మ రూపంలో ఓ కీలక వికెట్ కోల్పోయింది టీమిండియా.