CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజా పాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.