గూడ అంజన్న చివరి కోరిక.. కేసీఆర్ను చూడటమే అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, కేసీఆర్ ఆయనను కనీసం పరామర్శించడానికైనా వెళ్లలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ను కలవడానికి గద్దర్ను మూడు గంటలపాటు ఎండలో నిలబెట్టారని అన్నారు.
CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అమ్మకాలపై నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ(Telangana New Sand Mining Policy) రూపొందించాలని అధికారులకు సూచించారు.
CM Revanth Reddy: తెలంగాణ లోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్రెడ్డి హమీ ఇచ్చారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే.. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా నదిపై జరిగిన నిర్మాణాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
CM Revanth Reddy: హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
CM Revanth Reddy |కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన సపోర్టు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్ధి అని, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy: గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు బిజీబిజీగా గడిపారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు.
Numaish: సామాజిక బాధ్యతతో అనేక విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సొసైటీ యాజమాన్యంలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
CM Revanth reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
CM Revanth Reddy: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5,00,000/- (రూ. ఐదు లక్షల ) కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. ఇందు కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.