Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ దుర్గ గుడి ఈవో కు కరోనా పాజిటివ్

విజయవాడ కనకదుర్గ గుడి ఈవో సురేష్‌బాబుకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. 

విజయవాడ కనకదుర్గ గుడి ఈవో సురేష్‌బాబుకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఆలయంలో మరో 18 మందికి పాజిటివ్ గా తేలింది. గత శుక్రవారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమవారం నుంచి దేవస్థానంలో విధులకు హాజరుకావట్లేదు. ఆలయంలో పనిచేసే వేదపండితుడు ఒకరు కరోనా బారినపడి గురువారం మరణించారు. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఆయన భార్య కూడా ప్రస్తుతం ఐసీయూలో ఉంది. గతంలో మరో ఇద్దరు వేదపండితులు వైరస్‌ బారినపడిన సంగతి తెలిసిందే.