Asianet News TeluguAsianet News Telugu

video:రేణిగుంట విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం

కడప జిల్లా పర్యటన కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. 

విజయవాడ:  కడప జిల్లా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆదివారం రైల్వే కోడూరులో పర్యటించాల్సి వుంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే 
హైదరాబాద్ నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ రోడ్డు మార్గమున రైల్వేకోడూరు కు బయలుదేరి వెళ్లారు.