Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం.. దళిత జేఏసీ నిరసన దీక్షలు..

అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు. 

అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు. శాఖమూరులోని అంబేద్కర్‌ స్మృతివనం ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంబేద్కర్‌ స్మృతి వనం నిర్మాణం కోసం ఇప్పటికే 1,500 టన్నుల ఐరన్‌ వాడారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం స్మృతివనాన్ని తొలుత గుంటూరుకు మార్చుతున్నట్టు, ఆ తర్వాత విజయవాడకు మారుస్తున్నట్లు పలు ప్రకటనలు చేస్తోందన్నారు. అమరావతిలోనే అంబేద్కర్‌ స్మృతివనం ఉండాలని, లేదంటే తాము తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. వెంటనే రాజధాని అమరావతిలోనే అంబేద్కర్‌ స్మృతివనం పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.