Asianet News TeluguAsianet News Telugu

నువ్వెంతంటే నువ్వెంత.. వేదికపైనే జగదీశ్ రెడ్డి - ఉత్తమ్‌ల బాహాబాహీ (వీడియో)

పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ల మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకొన్నారు.
 

పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ల మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకొన్నారు.

నియంత్రిత సాగు విధానంపై నల్గొండ లో ఆదివారం నాడు ప్రజా ప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణ మాఫీ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియంత్రిత సాగు విధానంపై మాట్లాడే సమయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రైతు బంధును కుదించేందుకు నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. 

ఆ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సమయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది.రుణమాఫీని పూర్తి చేయలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం చోటు చేసుకొంది.

Video Top Stories