Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం ప్యాజెక్టు .. పనులు పూర్తి కాలేదంటూ హరీశ్ రావు ఫైర్..

సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు  పరిశీలించారు.

సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు  పరిశీలించారు. దాదాపు 40 కిలో మీటర్ల మేర ఉన్న కాలువ పై ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి హరీశ్ రావు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల అసంపూర్తి పనులపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.