Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో గ్యాంగ్ వార్ ... నడిరోడ్డుపై కర్రలు, రాళ్లతో ఇరువర్గాల వీరంగం

జగిత్యాల : పాతకక్షల నేపథ్యంలో రెండు వర్గాలు నడిరోడ్డుపై పరస్పర దాడులకు దిగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్త త చోటుచేసుకుంది. 

జగిత్యాల : పాతకక్షల నేపథ్యంలో రెండు వర్గాలు నడిరోడ్డుపై పరస్పర దాడులకు దిగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్త త చోటుచేసుకుంది. గాంధీ నగర్ సెంటర్ లో గత రాత్రి కర్రలు, రాళ్లతో రోడ్డుపైకి చేరుకున్న రెండువర్గాలకు చెందిన దాదాపు 50మంది విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. మహిళలు సైతం ఈ గొడవలో పాల్గొన్నారు. గ్యాంగ్ వార్ గురించి తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు సైతం కొద్దిసేపు పరిస్థితిని కంట్రోల్ చేయడం సాధ్యంకాలేదు. ఎలాగోలా ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఇరువర్గాల ఘర్షణ స్థానికులను భయాందోళనకు గురిచేసింది.