Asianet News TeluguAsianet News Telugu

భారతీయులంతా గుజరాత్ ఉప్పు తిన్నవారే..: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గాంధీ నగర్ :  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పై ప్రశంసలు కురిపించారు.

గాంధీ నగర్ :  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పై ప్రశంసలు కురిపించారు. భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం వెనక గుజరాత్ రాష్ట్రం వుందన్నారు. అలాగే భారతదేశంలో తయారయ్యే ఉప్పులో 75 శాతం వాటా గుజరాత్ దే అని రాష్ట్రపతి తెలిపారు. దీన్నిబట్టి ప్రతి భారతీయుడు గుజరాత్ ఉప్పు తింటున్నట్లేనని రాష్ట్రపతి ముర్ము చమత్కరించారు.