సినిమా బాగుండాలని మంత్రాలు చదివేస్తాడు: మారుతి | Saptagiri | Pellikani Prasad | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 20, 2025, 1:01 PM IST

సప్తగిరి హీరోగా, ప్రియాంక శర్మ హీరోయిన్ గా, మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాష, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా 'పెళ్లికాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం హాజరయ్యారు. మరో చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ మారుతి హాజరై మాట్లాడారు. సినిమా బాగుండాలని సప్తగిరి నిత్యం తపించిపోతాడని చెప్పారు.

Read More...

Video Top Stories