
బాబు విశాఖ టూర్: టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి..
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి. చంద్రబాబును కాన్వాయ్ పై వైసీపీ కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. ఎయిర్ పోర్టులోనే బాబు కాన్వాయ్ ను నాలుగు గంటలకు పైగా నిలిచిపోయింది. బాబును వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. ముందస్తుగా బాబును అరెస్ట్ చేశారు.చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోవడంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
Add Asianetnews Telugu as a Preferred Source
