Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో హైటెన్షన్... కొల్లు రవీంద్ర బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు

మచిలీపట్నం: తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. 

మచిలీపట్నం: తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ కు ముందు రవీంద్ర నివాసం వద్ద హై టెన్షన్ ఏర్పడింది. రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి  పోలీసులు చేరుకోగా ఈ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. తమ నాయకుడిని పోలీసులు బలవంతంగా తీసుకువెళుతుండగా వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే చివరకు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు వాహనంలో తరలించారు.  

Video Top Stories