జగన్ మిర్చి యార్డుకి రావడంతో బండారం బయటపడింది: మంత్రులకు అంబటి కౌంటర్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 20, 2025, 9:00 PM IST

కూటమి ప్రభుత్వం రైతులకు గాలికి వదిలేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు రావడంతో రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ బండారం బయటపడిందన్నారు. జగన్ పై మంత్రుల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.