Asianet News TeluguAsianet News Telugu

AP Assembly : సచివాలయం ముందు బైఠాయించిన చంద్రబాబు...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో పాల్గొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగా వెళ్లగా ప్లకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు. సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.