Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఆస్పత్రుల్లో కరోనా పేషంట్ కి అరగంటలో బెడ్.. వైఎస్ జగన్

కరోనాతో హాస్పిటల్ కు వచ్చే పేషంట్లకు అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

కరోనాతో హాస్పిటల్ కు వచ్చే పేషంట్లకు అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కరోనాపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. కరోనాతో నేరుగా హాస్పిటల్స్ కు వచ్చిన పేషంట్లకు బెడ్స్ లేవని చెప్పొద్దని ఆస్పత్రులకు వార్నింగ్ ఇచ్చాడు. కలెక్టర్లు, అధికారులకు ఫోన్ చేసి వెడితే బెడ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. కరోనా పేషంట్ల పట్ల మానవత్వం చూపించాలని తెలిపారు. 

Video Top Stories