కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సునీల్ కనుగోలుకు ఆ పార్టీ మరో బాధ్యత అప్పగించింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాన్ని, సోషల్ మీడియాలో ప్రచారాన్ని చూసుకునే బాధ్యతను ఆయనకే ఇచ్చినట్టు తెలిసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకూ ఆయనతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నట్టు సమాచారం.