న్యూడిల్లి: దేశరాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(గురువారం) వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్,ఉత్తరాఖండ్, గోవా, మణిఫూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈవీఎంలలో నిక్షితమైన వివిధ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమీషపన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేసింది.