మహిళలు అధికంగా ఓట్లేసిన చోట బీజేపీ బంపర్ విక్టరీ కొట్టిందని ప్రధాని అన్నారు. తనకు స్త్రీ శక్తి అనే కవచం లభించిందని.. కులాల పేరుతో ఓట్లు అడిగి కొన్ని పార్టీలు యూపీ ప్రజల్ని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని.. కులం, జాతి అనేది దేశ ప్రగతికి ఉపయోగపడాలి కానీ, విచ్ఛిన్నానికి కాదని ప్రధాని సూచించారు.
- Home
- National
- Five States election results 2022 live update: మహిళలు ఓట్లేసిన చోట బీజేపీకి విక్టరీ: ప్రధాని నరేంద్ర మోడీ
Five States election results 2022 live update: మహిళలు ఓట్లేసిన చోట బీజేపీకి విక్టరీ: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూడిల్లి: దేశరాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(గురువారం) వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్,ఉత్తరాఖండ్, గోవా, మణిఫూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈవీఎంలలో నిక్షితమైన వివిధ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమీషపన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేసింది.
స్త్రీ శక్తే నాకు రక్షణ కవచం
ప్రధాని మోడీపై పూల వర్షం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోడీపై బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
ఉత్తరాఖండ్ లో సీఎం, మాజీ సీఎం ఓటమి
ఉత్తరాఖండ్ లో హేమాహేమీలు ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం సీఎం పుష్కర్ సింగ్ దామితో పాటు మాజీ సీఎం హరీష్ రావత్ కూడా ఓడిపోయారు.
డిల్లీ నుండి పంజాబ్ కు... ఇదే స్పూర్తితో దేశమంతా: ఎన్నికల పలితాలపై కేజ్రీవాల్
పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకుని అద్భుత విజయం అందించారని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. డిల్లీలో ప్రారంభించి ఇప్పుడు పంజాబ్ కు వచ్చామని... ఇదే స్పూర్తి దేశం మొత్తం రావాలన్నారు. సెల్ ఫోన్ రిపేర్ షాప్ లో పనిచేసే అతి సామాన్యుడి చేతిలో సీఎం చన్నీ ఓడిపోయారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మణిపూర్ సీఎం బీరెన్ ఘనవిజయం
మణిపూర్ ముఖ్యమంత్రి బీరున్ సింగ్ 17వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
6750ఓట్ల తేడాతో పంజాబ్ పిసిసి చీఫ్ సిద్దూ పరాజయం
అమృత్ సర్ ఈస్ట్ లో పోటీచేసిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ 6750ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
61వేల మెజారిటీలో అఖిలేష్ ఘనవిజయం
కర్హల్ నియోజకవర్గం నుండి పోటీచేసిన సమాజ్ వాది పార్టీ నాయకలు అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థిపై 61వేల ఆధిక్యంతో గెలుపొందారు.
లక్ష ఓట్ల మెజారిటీతో సీఎం యోగి ఘనవిజయం
గోరఖ్ పూర్ అర్భన్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ మేజారిటీ సాధించారు. ఆయన లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణలోనూ అమిత్ షా బుల్డోజర్ వుంచారు...: రాజాసింగ్ సంచలనం
నాలుగు రాష్ట్రాల్లో బిజెపి సాధించిన విజయం జనతా విజయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ వుంచారు హోంమంత్రి అమిత్ షా అంటూ బిజెసిఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ ఓటమిని స్వీకరిస్తేన్నాం..: రాహుల్ గాంధీ
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ ఓటమి
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనానికి హేమాహేమీ నాయకులు సైతం ఓటమిని చవిచూసారు. వీరిలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా వున్నారు. అమృత్ సర్ ఈస్ట్ నుండి పోటీచేసిన సిద్దూ ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో పరాజయం పొందారు.
మణిపూర్ లో బిజేపిదే మేజిక్ ఫిగర్
మణిపూర్ లో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మొత్తం 60స్థానాలున్న ఈ రాష్ట్రంలో బిజెపి 32 గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ సాధించింది. ఇక్కడ ఎన్పిపి 8, కాంగ్రెస్ 5, ఇతరులు 15స్థానాలు గెలుచుకున్నారు. ఇతరుల మద్దతు లేకుండానే బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేలా సీట్లు వచ్చాయి.
ఉత్తరాఖండ్ లో బిజెపి ఘన విజయం
ఉత్తరాఖండ్ లో బిజెపి పార్టీ మరోసారి సత్తాచాటింది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా బిజెపి 48 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 18సీట్లకే పరిమితమయ్యింది. ఇతరులు 4చోట్ల గెలుపొందారు.
గోవా మాజీ సీఎం పర్సేకర్ ఓటమి
గోవాలో బిజెపి పార్టీ 20స్థానాలలో అతిపెద్ద పార్టీగా అవతరించినా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమిని చవిచూసారు.
గోవాలో మేజిక్ ఫిగర్కు అడుగు దూరంలో నిలిచిన బీజేపీ
గోవాలో పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. 40 స్థానాలులున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాలు గెలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (21)కి ఒక్క సీటు మాత్రం బీజేపీకి తగ్గింది. కాంగ్రెస్ 12, టీఎంసీ 2, ఆప్ 2 చోట్ల విజయం సాధించాయి.
పంజాబ్: మేజిక్ ఫిగర్ను దాటేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
పంజాబ్లో అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ను ఆమ్ ఆద్మీ పార్టీ (59) సాధించింది. అలాగే మరిన్ని స్థానాల్లో ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు సామాన్యుడి పార్టీ 70 స్థానాల్లో గెలిచింది.
పంజాబ్: రాజ్భవన్లో కాదు.. పూర్వీకుల స్వగ్రామంలో ప్రమాణ స్వీకారం
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో కాకుండా తన పూర్వీకుల గ్రామంలో ప్రమాణ స్వీకారం చేస్తానని భగవంత్ మాన్ తెలిపారు.
సోనూసూద్ సోదరి మాళవిక ఓటమి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు చిత్తవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చన్నీ సహా పలువురు ప్రముఖులు ఓటమి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ మోగ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గం గత 40 ఏళ్లుగా కాంగ్రెస్కు కంచుకోటగా వుంది
ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా : కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మణిపూర్ లో అతిపెద్ద పార్టీగా బిజెపి...
మణిపూర్ లో బిజెపి అధికారానికి చేరువలో నిలిచింది. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకున్నా ఈ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్పిపి 10, ఇతరులు 14 చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడా అతితక్కువగా 7సీట్లతోనే సరిపెట్టుకుంది.