రిజిస్టర్ కాని పెంపుడు జంతువులను పార్కులు, వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళితే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పౌర అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా జంతువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉల్లంఘన స్థాయిని బట్టి రూ.1,000 నుండి రూ.50,000 వరకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.