Sajjala Still Behind Jagan2.0: ఓటమి ప్రతి ఒక్కరికీ గుణపాఠం నేర్పుతుందని అంటారు. ఒడిపోవడం తప్పు కాదు.. కానీ కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోలేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న వైసీపీ... గత ఏడాది ఘెరంగా పరాజయం మూటగట్టుంది. పార్టీ ఓడిపోయినా 40 శాతం ఓటు బ్యాంకు సాధించుకుని కొంత వరకు మనుగడ సంపాదించుకుంది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. జగన్కు అనేక విషయాలు తెలియకుండా కోటరీ అడ్డుకుందని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి బయటకు వచ్చి కూటమిలో చేరిన వారు చెబుతున్నారు. ప్రధానంగా వారందరూ సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే ఇబ్బందులు పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాత్రం సజ్జలకు రోజుకో బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనిపై కూటమి ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది, వైసీపీలో నేతలు హ్యాపీగా లేరట. అసలు సజ్జల వల్ల వైసీపీకి నష్టమా? లాభమా?