తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో అధికార ఏర్పాటు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నేటి రాత్రి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.