తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం  ఇవాళ హైద్రాబాద్‌లోని ఓ హోటల్ లో సమావేశమైంది. కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం సోమవారంనాడు హైద్రాబాద్‌లోని ఓ హోటల్ లో ప్రారంభమైంది.ఈ సమావేశానికి ముందే సీఎల్పీ నేత పదవి కోసం పోటీ పడుతున్న నేతలు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వేరే హోటల్ లో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో విజయం సాధించిన ఎమ్మెల్యేలు హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా సీఎల్పీ పదవిని ఆశిస్తున్న నేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశం నుండి ఈ నేతలంతా నేరుగా గచ్చిబౌలిలోని హోటల్ కు చేరుకున్నారు.

also read:D.K. Shiva Kumar తో ఉత్తమ్, మల్లు భట్టి.. కోమటిరెడ్డి భేటీ: సీఎల్పీ భేటికి ముందే కీలక సమావేశంఈ సమావేశంలో సీఎల్పీ ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, దీపాదాస్ మున్షీ, అజయ్, మురళీధరన్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

also read:Errabelli dayakar Rao..డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించిన యశస్విని: ఎవరీ యశస్విని రెడ్డి

సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తే కాంగ్రెస్ అధినాయకత్వం సీల్డ్ కవర్లో పేరును సూచించే అవకాశం లేకపోలేదు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం పదవిని