వివాహేతర సంబంధం: మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొందని ఆరోపిస్తూ ఓ మహిళను భార్యతో పాటు ఆమె బంధువులు చితకబాదారు. దీంతో బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది
తిరుమలగిరి: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొందని ఆరోపిస్తూ ఓ మహిళను భార్యతో పాటు ఆమె బంధువులు చితకబాదారు. దీంతో బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చోటు చేసుకొంది.
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం సాగర్ మండలం అల్వాల్ లో తన భర్తతో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని అనుమానంతో రేణుక, తన బంధువులతో కలిసి బాధితురాలిని స్థంభానికి కట్టేసి చితకబాదింది.
ఇవాళ తెల్లవారుజామున బాధితురాలు ఇంటికి వచ్చిన నిందితులు ఆమెను స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఈ దాడులతో బాధితురాలు స్పృహా కోల్పోయింది. ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్థులు బాధితురాలిని విడిపించారు.
స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. దీంతో నిందితులు పారిపోయారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు చదవండి
అందంగా ఉన్నావు.. నువ్వంటే నాకిష్టం.. : ఎస్ఐ లైంగిక వేధింపులు
రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు
అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి
వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య
ట్విస్ట్: అందమైన భార్యను చూస్తున్నారని భర్త చేసిన పనికి షాకైన వైఫ్