Asianet News TeluguAsianet News Telugu

బండి మీద వెడుతున్న యువతి జుట్టుపట్టి లాగి, కిందేసి, ఈడ్చుకెళ్లి... మద్యంమత్తులో యువకుల వీరంగం..

మద్యం మత్తులో హైదరాబాద్ లో ఓ ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. బండిమీద వెడుతున్న యువతిని తిట్టి..జుట్టుపట్టిలాగి కిందపడేశారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి బీభత్సం సృష్టించారు.

two men harrassed women in hyderabad - bsb
Author
First Published Mar 27, 2023, 6:51 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ తానా పరిధిలో బండిమీద వెళుతున్న యువతిపై కొందరు వ్యక్తులు కర్రతో దాడి చేశారు. ఆ దాడిలో కిందపడిన యువతి జుట్టు పట్టి లాగి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి (21) హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అడ్డగుట్ట సొసైటీలో ఉన్న ఓ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. శనివారం నాడు ఆమె మరో ఆరుగురు స్నేహితులు కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న బిర్యానీ  వాలాకు వెళ్లేందుకు మూడు బండ్ల మీద బయలుదేరారు. 

ఓ బైక్ మీద వెనక యువతి కూర్చుంది. బేగంపేట్ వైపు నుంచి  బంజారాహిల్స్ రావడానికి జిపిఎస్ పెట్టుకున్నారు. పంజాగుట్ట సర్కిల్ వరకు బాగానే వచ్చారు. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ లో రోడ్డు పంజాగుట్ట స్మశాన వాటిక దగ్గర కొత్తగా వేసిన బ్రిడ్జి మీద నుంచి చూపించింది. మ్యాప్ ని ఫాలో అవుతూ ఆ దారిలో వాళ్లు  వెళుతున్నారు. ఇంతలో అదే దారిలో ఇద్దరు యువకులు మరో బైకు మీద వెళుతూ ఆమెను అవమానకరంగా మాట్లాడారు. వారిద్దరు మద్యం మత్తులో ఉన్నారు. వీళ్లు వారిని దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. అయితే,  అది డెడ్ అండ్ కావడం, అటు నుంచి దారి లేకపోవడం… మ్యాపు రాంగ్ రూట్ చూపించడంతో  అదే దారిలో మళ్లీ వెనక్కి మళ్లారు.

రూ.200 కోసం కిరాతకం ... కన్న కొడుకును కొట్టిచంపిన కసాయి తండ్రి

ఈ క్రమంలో అంతకుముందు మద్యం తాగి అమ్మాయిని దుర్భాషలాడిన  యువకుల్లో ఒకరు ఆమె మీద కర్రతో దాడి చేశారు. మరొకడు ఆమె జుట్టుపట్టుకుని లాగాడు.  దీంతో అమ్మాయి కింద పడిపోయింది. ఆమె జుట్టు పట్టుకొని అలాగే వారిద్దరూ కొంత దూరం లాక్కెళ్ళారు. ఇది గమనించిన అమ్మాయితో వచ్చిన మిగతా స్నేహితులు ఆ ఇద్దరినీ పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అమ్మాయి మీద దాడి చేసిన ఆ యువకులిద్దరిని పోలీసులు గుర్తించారు. ఒక యువకుడు పంజాగుట్టకు చెందిన  కొండ గోపి(24), మరో యువకుడు పంజాగుట్ట పోచమ్మ బస్తికి చెందిన పుణ్య సాయి కళ్యాణ్ (25).

అసలే మాత్రం సంబంధం లేని యువతితో వాళ్లు గొడవకు దిగడానికి గల కారణం మద్యం మత్తే అని తేలింది. అంతకుముందే వారికి మరో యువతితో గొడవ జరిగింది. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న ఈ యువతిని చూసి.. ఆ యువతి ఈమె అనుకుని దాడి చేశారు. పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారు. స్నేహితులతో పాటు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios