బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయిందని.. పోలీసుల తీరుపై ప్రియాంక పేరెంట్స్
గురువారం సాయంత్రం ట్రీట్మెంట్ కోసం ప్రియాంక రెడ్డి మాదాపూర్ హాస్పిటల్ కి వెళ్లింది. కానీ తిరిగి ఇంటికా రాలేదు. ఆమెను నలుగురు దుండగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కాగా.. కేసును పోలీసులు తాజాగా చేధించారు.
ప్రియాంక రెడ్డి దారుణ హత్యతో ఆమె తల్లిదండ్రులు, సోదరి భవ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా... తమ కుమార్తె హత్య విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని... ఫోన్ కూడా కలవడం లేదంటూ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు చెప్పారు.
Also Read ముందే స్కూటర్ పంచర్ చేసి... ప్రియాంక రెడ్డి కేసును చేధించిన పోలీసులు
అయితే... పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటూ జాప్యం చేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరేమో.. బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయిందేమో అంటూ అసభ్యకరంగా మాట్లాడారని వారు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసుల తీరు తమను బాధపెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
AlsoRead రోజురోజుకి భయం పెరిగిపోతుంది.. ప్రియాంకారెడ్డి ఘటనపై కీర్తి సురేష్!
కాగా.. గురువారం సాయంత్రం ట్రీట్మెంట్ కోసం ప్రియాంక రెడ్డి మాదాపూర్ హాస్పిటల్ కి వెళ్లింది. కానీ తిరిగి ఇంటికా రాలేదు. ఆమెను నలుగురు దుండగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కాగా.. కేసును పోలీసులు తాజాగా చేధించారు.
ముందుగానే స్కూటర్ పంచర్ చేసి... ఆమెను ట్రాప్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రియాంకపై అత్యాచారం చేసేందుకు దుండగులు స్కూటీ డ్రామా ఆడారని చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. టోల్ ప్లాజా వద్ద ఉన్నా లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రియాంక రెడ్డిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.
AlsoRead ప్రియాంక రెడ్డి హత్య ఎఫెక్ట్...వాహనం పాడైతే మాకు చెప్పండంటున్న పోలీసులు...
టోల్ ప్లాజా వెనక వైపు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అనంతరం.. ఆమె మెడకు చిన్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. కాగా... చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి... అనంతరం పెట్రోల్ పోసి తగలపెట్టారని చెబుతున్నారు.
ప్రియాంక రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పాషాగా గుర్తించారు. అతనిది మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట అని పోలీసులు చెబుతున్నారు
AlsoReadప్రియాంక రెడ్డి స్కూటీ, లోదుస్తులు లభ్యం.... ఆ ఇద్దరిపైనే అనుమానం.....
కాగా.. ప్రియాంక ప్రయాణించిన స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. దుండగులు స్కూటీ నెంబర్ ప్లేట్లను తొలగించి బస్టాండ్ దగ్గర వెదిలివెళ్లారు.
స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్కూటీ దొరికిన ప్రాంతాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రియాంకను హత్య చేసింది అనంతపూర్కు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లుగా అనుమానిస్తున్నారు. లారీ నెంబర్ను కూడా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా.. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ టోల్గేట్ పక్కనున్న కాంపౌండ్ వద్ద ప్రియాంక ఇన్నర్వేర్తో పాటు చెప్పులను పోలీసులు గుర్తించారు. అలాగే వాటి పక్కనే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.