పూల్వామా దాడి: కేసీఆర్ మనస్తాపం, జన్మదిన వేడుకలకు దూరం
కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా కలత చెందారు. ఈ నెల 17వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలను జరుపుకోరాదని సీఎం నిర్ణయించారు.
గురువారం సాయంత్రం పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది సీఆర్పీఎప్ జవాన్లు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటనతో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనతో తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్టుగా ఆయన ప్రకటించారు. దేశమంతా విషాదంలో ఉన్న సమయంలో ఉత్సవాలు జరుపుకోవడం సరైంది కాదన్నారు. ఈ నెల 17వ తేదీన తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఎలాంటి ఉత్సవాలు చేసుకోవద్దని ఆయన సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడ తన పుట్టిన రోజు వేడుకలను జరపకూడదని కేసీఆర్ సూచించారు.
సంబంధిత వార్తలు
పుల్వామా దాడి: పాకిస్తాన్కు మోడీ హెచ్చరికలు
42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?
"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు
జమ్మూ కశ్మీర్లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో
జమ్మూ కశ్మీర్లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి