Asianet News TeluguAsianet News Telugu

పూల్వామా దాడి: కేసీఆర్ మనస్తాపం, జన్మదిన వేడుకలకు దూరం

కాశ్మీర్‌లోని పుల్వామాలో  సీఆర్‌పీఎఫ్  జవాన్లపై ఉగ్రవాదుల దాడిని  తెలంగాణ సీఎం కేసీఆర్  తీవ్రంగా ఖండించారు. 

kcr decides to not celebrates his birthday
Author
Hyderabad, First Published Feb 15, 2019, 12:12 PM IST

హైదరాబాద్: కాశ్మీర్‌లోని పుల్వామాలో  సీఆర్‌పీఎఫ్  జవాన్లపై ఉగ్రవాదుల దాడిని  తెలంగాణ సీఎం కేసీఆర్  తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా కలత చెందారు. ఈ నెల 17వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలను జరుపుకోరాదని సీఎం నిర్ణయించారు.

గురువారం సాయంత్రం పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది సీఆర్‌పీఎప్ జవాన్లు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటనతో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని  కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

ఈ ఘటనతో తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్టుగా ఆయన ప్రకటించారు. దేశమంతా విషాదంలో ఉన్న సమయంలో ఉత్సవాలు జరుపుకోవడం సరైంది కాదన్నారు. ఈ నెల 17వ తేదీన తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఎలాంటి ఉత్సవాలు చేసుకోవద్దని ఆయన సూచించారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడ తన పుట్టిన రోజు వేడుకలను జరపకూడదని  కేసీఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు

పుల్వామా దాడి: పాకిస్తాన్‌కు మోడీ హెచ్చరికలు

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

 

Follow Us:
Download App:
  • android
  • ios