జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది చివరి వీడియోను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ విడుదల చేసింది. దాడికి పాల్పడిన ముష్కరుడి పేరు అదిల్ అహ్మద్.. సదరు వీడియోలో జైషే సంస్థ జెండా ముందు అదిల్ ఆటోమెటిక్ రైఫిల్స్ను తగిలించుకుని కనిపిస్తాడు.
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది చివరి వీడియోను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ విడుదల చేసింది. దాడికి పాల్పడిన ముష్కరుడి పేరు అదిల్ అహ్మద్.. సదరు వీడియోలో జైషే సంస్థ జెండా ముందు అదిల్ ఆటోమెటిక్ రైఫిల్స్ను తగిలించుకుని కనిపిస్తాడు.
‘‘ ఈ వీడియో మీరు చూసేసరికి... తాను స్వర్గంలో ఉంటానని... జైషేలే మిలిటెంట్గా ఏడాది పాటు ఉన్నానని, కశ్మీరీ ప్రజలకు తానిచ్చే చివరి సందేశం ఇదేనన్నాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, ఇక ఉత్తర, మధ్య కశ్మీరీలతో పాటు జమ్ము ప్రజలు కూడా తమతో చేరాల్సిన సమయం వచ్చిందని జనానికి పిలుపునిచ్చాడు.
అలాగే తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను కొంతమందిని చంపినంత మాత్రాన తాము బలహీనపడిపోతామని అనుకోవద్దని’’ అదిల్ హెచ్చరిస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. అదిల్ అహ్మద్ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి.. 2016, మార్చి 19 నుంచి అదిల్తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు టౌసిఫ్, వసీమ్ కనిపించడం లేదని అక్కడి పోలీసులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో
జమ్మూ కశ్మీర్లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Feb 14, 2019, 8:38 PM IST