టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్
టీవీ9 యాజమాన్య వివాదం విషయమై ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీవీ9 వివాదం విషయమై ఈ బోర్డు కొత్త నిర్ణయాలను ప్రకటించనున్నారు.
హైదరాబాద్: టీవీ9 యాజమాన్య వివాదం విషయమై ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీవీ9 వివాదం విషయమై ఈ బోర్డు కొత్త నిర్ణయాలను ప్రకటించనున్నారు.
శుక్రవారం సాయంత్రం తాజ్ డెక్కన్ హోటల్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ హోటల్లోని గోల్డెన్ మైల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నాడు ఉదయం ఏబీసీఎల్ బోర్డు సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో కొత్త సీఈఓను ఎన్నుకొన్నారని తెలుస్తోంది. సింగారావును కొత్త సీఈఓగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
బోర్డు నిర్ణయాలను ఈ మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. టీవీ9లో చోటు చేసుకొన్న వివాదంలో రవి ప్రకాష్ను తొలగించినట్టుగానే ప్రచారం సాగుతోంది. కానీ,ఈ విషయమై స్పష్టత రాలేదు ఈ విషయాలపై బోర్డు తన నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత వార్తలు
టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్
రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు
ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?
రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు
రవిప్రకాష్ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్పోర్ట్ స్వాధీనం
టీవీ9 వివాదం: రవిప్రకాష్తో హీరో శివాజీ లింక్ ఇదే
టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్పై ఆరోపణలివే
టీవీ9 సీఈఓ రవిప్రకాష్కు ఉద్వాసన?
టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు