పాస్ పార్ట్ రెన్యూవల్ కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ యువ టెక్కీ హైదరాబాద్ లో హఠాన్మరణం చెందారు. బాత్ రూం గుండెపోటుతో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన స్వస్థలం వరంగల్. అమెరికాలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. తన పాస్ పోర్టు గడువు తీరిపోతుండటంతో దానిని రెన్యూవల్ చేయించడానికి హైదరాబాద్ కు వచ్చారు. పని పూర్తి చేసుకొని స్నేహితుడి గదికి వెళ్లారు. బాత్ రూమ్ లోకి వెళ్లి అందులోనే గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
బ్రేకింగ్ : జైపూర్-ముంబై రైలులో నలుగురు ప్రయాణికులను కాల్చి చంపిన ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్..
వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ సిటీకి చెందిన త్రిపురాడి నవీన్ కుమార్ కుమారుడు మణిరాజ్ (30) అమెరికాలో నివసిస్తున్నాడు. అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. తన పాస్ పోర్టు గడువు తీరిపోతుండటంతో దానిని రెన్యూవల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తన స్వస్థలానికి వచ్చాడు. అక్కడి నుంచి శుక్రవారం హైదరాబాద్ కు వచ్చాడు.
అదే రోజు మణిరాజ్ పాస్ పోర్టు ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ రెన్యూవల్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకున్నాడు. అనంతరం తన స్నేహితుడైన కొత్త చాణక్య ఫ్లాట్ కు వెళ్లాడు. ఆ ప్లాట్ మణికొండ అలకాపూర్ టౌన్షిప్ లోని సిద్దార్థ రెసిడెన్సీలో ఉంది. మరుసటి రోజు శనివారం మరి కొందరు స్నేహితులతో కలిసి పలు దేవాలయాలను సందర్శించాడు. అనంతరం ఓ పబ్ కు వెళ్లారు. రాత్రి చాలా లేట్ గా మళ్లీ మణికొండలో ఉన్న స్నేహితుడి ఫ్లాట్ కు వచ్చాడు.
తాగేందుకు నీళ్లు అడిగాడని.. వికలాంగుడిపై దాడి చేసిన జవాన్లు.. వీడియో వైరల్
ఉదయం చాణక్యకు అపార్ట్ మెంట్ లో మీటింగ్ ఉండటంతో స్నేహితుడిని నిద్రలేపకుండా ఒక్కడే కిందికి వెళ్లిపోయాడు. అతడు తన ఫ్లాట్ కు తిరిగి వచ్చే సరికి ఉదయం పదకొండున్నర అవుతోంది. అయితే రూమ్ లో మణికొండ కనిపించకపోయే సరికి ఆందోళన చెందాడు. బాత్ రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టాడు. కానీ లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో చాణక్య తన వాచ్ మెన్, మరొక బంధువును ఫ్లాట్ కు తీసుకొచ్చాడు. ముగ్గురూ కలిసి బాత్ రూమ్ ను ఎలాగోలా తెరిచారు.
విషాదం.. ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలో మునిగి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ దుర్మరణం
అయితే మణిరాజ్ బాత్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే వారు ఆంబులెన్స్ కు కాల్ చేశారు. ఆంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించారు. కానీ అప్పటికే మణిరాజ్ గుండెపోటుతో మరణించాడని ప్రకటించారు. మణిరాజ్ గుండెపోటుతో మరణించాడనే విషయాన్ని అతడి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. తండ్రి అక్కడికి చేరుకున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.