‘తప్పులు అందరూ చేస్తారు..పాండ్యాని చూసి గర్వపడుతున్నా’
తప్పులు అందరూ చేస్తారని.. అసలు తప్పు చేయని వారు ఎవరూ ఉండరని అంటున్నారు టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నారు.
తప్పులు అందరూ చేస్తారని.. అసలు తప్పు చేయని వారు ఎవరూ ఉండరని అంటున్నారు టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టీం ఇండియా ఆల్ రౌండర్ పై తాజాగా రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని వివాదాలు అతనిని చుట్టుముట్టినా.. హీరోలా వాటన్నింటినీ పాండ్యా దాటుకున్నాడని రవిశాస్త్రి అన్నారు.
తన దృష్టిలో నిజమైన హీరో హార్దిక్ పాండ్యా అని ఆయన పేర్కొన్నారు. కాఫీ విత్ కరణ్ వివాదం తర్వాత పాండ్యా కెరీర్ గురించి తాను చాలా బాధపడినట్లు ఆయన చెప్పారు. కానీ.. పాండ్యా ఇప్పుడు వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాడని వివరించారు. ఈ షో తర్వాత పాండ్యా మానసిక స్థితిని దెబ్బ తీయాలని చాలా మంది ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
కానీ.. పాండ్యా చాలా త్వరగా దాని నుంచి బయటకు వచ్చాడని చెప్పారు. పాండ్యా నిజమైన హీరో అని.. అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఒక కోచ్ గా పాండ్యాని చూసి తాను గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు.