ఉప్పల్ లో ఐపీఎల్ ఫైనల్... ఏర్పాట్లు పూర్తి
ఐపీఎల్ సీజన్ 12 క్లైమాక్స్ కి చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్ సీజన్ 12 క్లైమాక్స్ కి చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. కాగా... ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన మ్యాచ్ కోసం చేసిన ఏర్పాట్ల గురంచి వివరించారు.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. నిత్యం పర్యవేక్షిస్తామని, ఇందుకోసంస్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,850 మంది పోలీసులతో మ్యాచ్కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు.
హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్, మద్యం, తినే ఆహార పదార్థాలతోపాటు బయటినుంచి తీసుకొచ్చే వాటర్ బాటిళ్లను సైతం లోపలికి అనుమతించమని వెల్లడించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, అన్ని ప్రవేశద్వారాల వద్ద చెకింగ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు.