Asianet News TeluguAsianet News Telugu

వినాయక చవితి రోజున పూజ

దీపారాధనకు రెండు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను వేసి కొబ్బరినూనెతో దీపం వెలిగించాలి.ఉదయం 9 గంటల నుంచి 11:50 నిమిషాలోపు పూజను పూర్తి చేయాలి

How to do Vinayaka Chavithi Pooja
Author
Hyderabad, First Published Sep 10, 2021, 7:23 AM IST

 

భౌతిక బలం కంటే బుద్ధిబలం గొప్పదని చాటి చెప్పిన విజ్ఞుడు విఘ్నేశ్వరుడు. పట్టుదల, బుద్ధిబలం వంటివి గణనాథునిలో ఉండటంతోనే గణాధిపతి అయ్యాడని మన పెద్దలు చెబుతారు. 

ఏకదంతాయ విద్మ హే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి: ప్రచోదయాత్ 

తత్కరాటాయ విద్మ హే హస్తిముఖాయ ధీమహి
తన్నో దంతి : ప్రచోదయాత్ 

లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి
తన్నో దంతి: ప్రచోదయాత్ ...   అంటూ విఘ్నేశ్వరుని నమస్కరించుకుని వినాయక చతుర్థి నాడు పూజ చేయాలి. భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి నాడు సూర్యోదయం కంటే ముందే లేవాలి. శుచిగా అభ్యంగ స్నానమాచరించి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. 

గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చ రంగు వస్త్రమును కప్పిన కలశమును, వినాయకుడి ఫోటో లేదా శ్వేతార్క గణపతి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. పసుపురంగు అక్షతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలలతో గణపతిని అలంకరించుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి.

దీపారాధనకు రెండు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను వేసి కొబ్బరినూనెతో దీపం వెలిగించాలి.ఉదయం 9 గంటల నుంచి 11:50 నిమిషాలోపు పూజను పూర్తి చేయాలి. విగ్రహాన్ని పూజకు ఉపయోగించిన పక్షంలో మండపంపై విగ్రహం ఉంచి పవిత్ర జలంపై పాదాల్ని కడగాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో పంచామృత స్నానం చేయించాలి. ప్రతి అమృతానికి నడుమ నీటితో శుభ్రం చేస్తుండాలి. తర్వాత వినాయక ప్రతిమకు గంధం, అద్ది, ఎరుపులేదా, పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠం.

కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, ఋణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా "ఓం గం గణపతయే నమః" అనే మంత్రమును 108 సార్లు జపించాలి.తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
ఇంట్లో పూజకోసం ఏర్పాటు చేసుకున్న మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసేవరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి హారతి ఇస్తుండాలి. పూజ పూర్తయ్యాక అక్షతలు వేసి విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి.

వినాయక చతుర్థి నాడు సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు,మానసిక సంతృప్తి లభిస్తాయి.అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యానశ్లోకం, గరికతో గణపతి గకార అష్టోత్తరం, గణేశ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి, సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతాయని అంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లంటే మహా ప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకమూ రాదని చెబుతారు. ఉండ్రాళ్ళు తయారుచేసి బొజ్జ గణపయ్య ఇష్టపడి తినేలా చేయండి.


వినాయక చవితి పూజ:- ఏ పూజ అయినా వ్రతమైనా చివరకు ఏ పనిని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు ఏకవింశతి " 21 " పత్రాలతో పూజించి  వ్రతకథ చెప్పుకుని ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.

ఈ చవితి రోజున చంద్రుడిని చూడడం దోషం, చవితి చంద్రుడు ఈ రోజు నుండే ఆకాశంలో విహరిస్తాడు. ఎవరైనా చంద్రుడిని పొరపాటున చూస్తే ఈ మంత్రం జపము చేయడం చాలా మంచిది. 

సింహః ప్రసేన మవదీత్,
సింహో జాంబవంతాహతః,
సుకుమారక మారోధి,
స్తవహ్యేశ స్యమంతకః,

శ్రీ వరసిద్ది వినాయక పూజకు కావలసిన వస్తువులు, పూజా విధానము.

పసుపు 25 గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి
మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం
బియ్యం అరకిలో
తమలపాకులు 20
అగరవత్తులు 1 పేకట్
పత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు)
దీపము ( కొబ్బర నూనెతో శ్రేష్టం,ఆవునేయ్యి ఉపయోగించవచ్చును)
పంచామృతములు ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార . 
గంధము, వక్కలు, ఖర్జర పండ్లు,
బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ
హరతి కర్పూరం.

నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను తయారు చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యమని కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసిన అచ్చులు వినాయక చవితి ముందురోజు నుండే పెడుతున్నారు. ప్రతిమ అన్నిటికన్నా మంచిదని గణేశ పురాణము బట్టి గ్రహించవలెను.

దూర్వాయుగ్మ పూజ :- వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు.చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా " మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా " అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు. 

" వినా దూర్వాంకు రై : పూజా ఫలంకేనాపి నాప్యతే

తస్మాదిషసి మద్భ   త్వరిత రేఖా

భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్

నతత్క్ర్ తుశతై   రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై : "

వినాయక చవితి రోజున వినాయక వ్రతము ప్రముఖ శుభకార్యం కాబట్టి ముందు పసుపుతో చేసిన గణపతి పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను.చిన్నపల్లెములో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచవలెను.స్వామి వారు తూర్పు దిశ చూస్తున్నట్లు ఉండవలెను.కొబ్బరి నూనె లేదా ఆవునేతితో దీపము వెలిగించి గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువవలెను.

ఓం శ్రీ మహాగణాధిపతియే నమః : శ్రీ గురుభ్యోనమః : హరి : ఓం

శ్లో. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
  ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే .

మంత్రం:-  ఓం   దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా: 
పశో వదంతి సానో మంద్రేష ముర్జందుహానా ధేనుర్వాగస్మాను  ప్రతిష్టతైతు

అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.

ఆచమనం :- పాత్ర (అనగా చిన్న చెంబు లేక గ్లాసు) నీటితో లేదా స్పర్శతో ఆచమనం చేయవలెను. బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.

ఓం కేశవాయ స్వాహా:  
ఓం నారాయణాయ స్వాహా:  
ఓం మాధవాయ స్వాహా:

( ఈ మూడు నామములను చెప్పుకుంటూ కుడి చేతిలో నీరు వేసుకొని శబ్ధం రాకుండా త్రాగవలెను )

ఓం గోవిందయ నమః  ( చేయ్యి కడుగ వలెను )

ఓం త్రివిక్రమాయ నమ : 
ఓం వామనాయ నమ : 
ఓం శ్రీధరాయ నమ : 
ఓం హుర్షీకేశవాయ నమ :
 ఓం పద్మనాభాయ నమ : 
ఓం దామోదరాయ నమ : 
ఓం సంకర్షణాయ నమ : 
ఓం వాసుదేవయ నమ : 
ఓం ప్రాయోమమయ నమ : 
ఓం పురుషోత్తమయ నమ :
 ఓం అధోక్షోజయ నమ : 
ఓం అచ్యుతాయ నమ : 
ఓం జనతనాయ నమ : 
ఓం హరయే నమ : 
ఓం శ్రీ కృష్ణాయ నమ :

దైవ ప్రార్థన :- గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.

శ్లో :- ఓం యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళం |  తయోస్సంస్మరణాత్  పూర్వం సర్వతో జయ మంగళం

  లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరహశ్యామో హృదయ స్థోజనార్థన :
  
  సర్వమంగళ మాగళ్యే శివే సర్వార్థసాధకే | శరణ్యే త్ర్యంబకేదేవి నారాయణి నమోsస్తేతే .
 
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ : 
ఉమా మహేశ్వరరాభ్యాం నమ : 
శచీ పురంధరాయణ నమ : 
అరుంధతి వశిష్టాభ్యాం నమ : 
శ్రీ సీతారామభ్యాం నమ: 
సర్వేభ్యో మహాజనేభ్యో నమ: 

( క్రింది విధముగా చదువుతూ అక్షితలను వెనుక వైపు  వేసుకొనవలెను )

శ్లో :-  ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

ప్రాణానాయమ్య ( ముక్కు పట్టుకుని )
ఓం భూ : ఓం భువ : ఓం సువ : ఓం మహా : ఓం జన : ఓం తప : ఓగ్ం సత్యమ్   ఓం తత్సవితుర్వేణ్యం  భర్గోదేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ ఓమ్ ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళ సహయంతో ముక్కును పట్టుకుని ఎడమ ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భుర్భువస్సువరోం వరకు మంత్రం చదివేంత వరకు గాలిని బంధించి తరువాత మెల్లగా గాలిని కుడి వైపున ముక్కు రంధ్రం ద్వారా వదలాలి.

సంకల్పము :- మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే , శ్రీ మహా విష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ............... .నామా సంవత్సరము, దక్షిణాయేనే, వర్షరుతుడు, భధ్రపదమాసే, శుక్లప క్షేత్రం, చతుర్థ్యం .................. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ ............ గోత్ర: ......... .నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం , ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవత క దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ( అని సంకల్పం చేసి )

( కలశంలోని నీరు ముట్టుకొనవలెను )

శ్లో : కలశస్య ముఖే విష్ణు : కంఠే రుద్రస్సమాశ్రిత:
 మూలే తత్రస్థితో బహ్మ మధ్యే మాతృగణా స్సౄతా:
 కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 
 ఋగ్వేదోధయర్వేద స్సామవేదో హ్యధర్వణ:
అంగైశ్చ సహిత స్సర్వే కలశాంబు సమాశ్రితా:

ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరషిచ్యతే ఉక్ధైర్యజ్ఞేషు వర్ధతే , ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వభూత న్యాప:  ప్రాణావా ఆప: పశవ ఆపో౭న్నమాపో౭ మృత మామస్సమ్రాడాపో విరాడాప స్వరాడా పశ్చందాగ్ శ్యాపో జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాప స్సర్వా   దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం .

గంగేచయమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు

ఆయాంతు  శ్రీ మహాగణపతి పూజార్ధం మమ దురతక్షయ కారకా: కలశోదకేన దేవత, ఆత్మానం, పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య. 
(కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజద్రవ్యముల పైన చల్లవలెను.

గణపతి పూజ, ప్రాణ ప్రతిష్ట

(పుష్పముతో పసుపు గణపతి తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.

అసునీ తేపునరస్మాసు చక్షు : పునః : ప్రాణ మినహనో దేహి భోగమ్

జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమంతే మృడయాన స్వస్తి

ఓం అమృతం వై ప్రాణా: అమృతమాప: ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే
స్థిరోభవ,వరదోభవ,సుముఖోభవ,సుప్రసన్నోభవ,స్థిరాసనం కురు.

 ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్. 

షోడశోపచార పూజ :-

( క్రింది విధంగా చెబుతూ ఒక్కొక్కటికి గణపతికి అక్షితలను సమర్పించవలెను)

శ్రీ మహాగణాధిపతియే నమః: ధ్యాయామి ధ్యానం  సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహసనం సమర్పయామి.

(అగరోత్తులు వెలిగించి దూపము చూపించాలి)

శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.

(దీపానికి నమస్కరించవలెను)

దీపం దర్శయామి. ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పామి. నైవేద్యం సమర్పామి.

నైవేద్యం:- బెల్లము\ వండిన ప్రసాదం మీద నీరు చల్లి చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.

ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్.

నీళ్ళు పుష్పంతో చల్లి

ఓం సత్యం త్వర్తేన పరిషించామి.
 
పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి.

ఓం అమృతమస్తు  ఓమ్ అమృతోపస్తణమసి

 ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం

ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి. 

శ్రీ మహాగణాధిపతియే నమః: తాంబులం సమర్పణమి.

(కర్పూరం వెలిగించి గంట మ్రోగించాలి)

శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పణమి

పూజ చేసిన అక్షితలను, పుష్పములు శిరస్సున ధరించవలెను.

శ్లో : యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప  మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప  యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే.

అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు

అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.మనస్పూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోవాలి.

ఉద్వాసన :- యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే  యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ

పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.

గణపతి అష్టోతర శతనామావళి:-

ఓం వినాయకాయ నమ:    ఓం గ్రహపతయే నమ:    ఓం అగ్రగణ్యాయ నమ:
ఓం విఘ్నరాజయ నమ:    ఓం కామోనే నమ:    ఓం గ్రామణ్యై నమ:
ఓం గౌరీపుత్రాయ నమ:    ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:ఓం గణపాయనమ:
ఓం గణేశ్వరాయ నమా:    ఓం పాశాంక్శధరాయ నమ:    ఓం స్దిరార నమ:
ఓం స్కందాగ్రజాయ నమ:    ఓం చందయ నమ:    ఓం వృద్ధిదాయ నమ:
ఓం అవ్యయేయ నమ:    ఓం గుణితతాయ నమా:    ఓం సుభాగే నమ:
ఓం పూతాయ నమ:    ఓం నిరంజానాయ నమ:    ఓం శూరయ నమ:
ఓం దక్షాధరాశియ నమ:    ఓం అకల్మాషాయ నమ:    ఓం వాగీశాయ నమ:
ఓం ద్విజప్రియే నమ:    ఓం స్వయంసిదాణ్య నమ:    ఓం సిధిత్య నమ:
ఓం అగ్నిగర్వభిదేశ్ నమ:    ఓం సిద్దార్చితవతాంబుజయ నమ: ఓం దూర్వాబిల్విప్రియాయ నమ:
ఓం ఇంద్రద్రిప్రైతియ నమ:    ఓం బీజాపూరకాయ నమ:    ఓం కాంతాయ నమ:
ఓం వాల్బలప్రియయే నమ:   ఓం అవ్యక్తయే నమ:    ఓం పాపహారిణేనమ:
ఓం సర్వసిద్దప్రతికాయ నమ: ఓం వరయియమ్ నమ:    ఓం కృతమాయ నమ:
ఓం శర్వతాయాయ నమా:    ఓం శాశ్వతాయ    ఓం సమహితాయ నమ:
ఓం శర్వప్రియయే నమ:    ఓం కృతినే పేరు:    ఓం వకృతుండయ నమ:
ఓం సర్వాత్మ్య నమ:    ఓం విద్వాత్రియయ నమః:    ఓం శ్రీప్రైటి నమ:
ఓం క్రియేకర్ర్తేనామ:    ఓం వీతభయాయ నమః:    ఓం సౌమ్య్యాయ నమ:
ఓం దేవానీకార్చుయ నమ:   ఓం గణనే నమ:    ఓం భక్తికాంక్షితాదాయితే నమ:
ఓం షివాయ నమ:    ఓం చక్రిణే నమ:    ఓం అచ్యుతాయ నమ:
ఓం శుడేది నమ:    ఓం ఇక్షుచాపధతేతే నమ:    ఓం కేవలాయ నమ:
ఓం బుద్దిప్రియయే నమ:    ఓం అబ్జోత్పలకరాయ నమ:    ఓం సిద్దాయియ నమ:
ఓం శాంతాయ నమ:    ఓం శ్రీశాయ నమ:    ఓం జ్ఞానినే పేరు:
ఓం బ్రహ్మచారిణి నమ:    ఓం శ్రీపతయే నమ:    ఓం మాయాపాయణ నమ:
ఓం గజాననాయ నమ:    ఓం స్తుతిహర్షితా నమ:    ఓం కాంతాయ నమ:
ఓం డత్మేమాతురాయనమ:  ఓం కులాద్రిభారతే నమ:    ఓం బ్రహ్మిష్ఠాయ నమ:
ఓం మునిస్థతాయ నమ:     ఓం జటినే నమ:    ఓం భయవర్జితాయ నమ:
ఓం భక్తవిఘ్నవినాశినే నమ: ఓం చంద్రచూడాయ నమ:    ఓం ప్రమత్తదైత్యభయాయ నమః:
ఓం ఏకదంతాయ నమ:    ఓం అమరేశ్వరాయ నమ:    ఓం వ్యక్తమూర్తయే నమ:
ఓం చతుర్బాహవే నమ:    ఓం నాగయజ్ణోపవీతినే నమ: ఓం అమూర్తకాయ నమ:
ఓం శక్తిసయుతాయ నమ:    ఓం శ్రీకంఠాయ నమ:    ఓం పార్వతీశంకరోత్చంగఖేల నమ:
ఓం చతురాయి నమ:    ఓం వ్రతినే నమ:    ఓం నోత్చవలాలనాయ నమ:
ఓం లంబోదరాయ నమ:    ఓం మూలకంఠాయ నమ:    ఓం సమస్త జగదాధార నమ:
ఓం శూర్పకర్ణాయ నమ:    ఓం త్రయికర్ర్తే నమ:    ఓం వరముషకశానయ నమ:
ఓం హేరంబాయి నమ:    ఓం సామఘెషప్రియా నమ:    ఓం హృష్టస్తుతాయ నమ:
ఓం బహ్మవత్తమాయ నమ:    ఓం పురుషోత్తమాయ నమ:    ఓం సర్వ సిద్ది ప్రియ కాయ నమ:
ఓం కాలయ నమ:    ఓం స్ధూలతుండాయ నమ:    ఓం సిద్దలక్ష్మి గణపతయే నమ:
 
భక్తి అంటే కూర్చుని భజన చేయడం, లేకపోతే పేరును తలచుకోవడమో, పారాయణ చేసుకోవటం, సత్సంగాలు చేసుకొవడం మాత్రమే కాదు. మనం ఏ పని చేసినా  ప్రతి అడుగు భగవంతుని వైపుకు వేయాలి. ఏ రకంగా వేస్తే భగవంతుని వైపుకి చేరుతామో అది "భక్తి" అది మన జీవితంలో ఒక భాగం కావటం కాదు, మన జీవితమే దాంట్లో భాగం కావాలి. మనం ఏ పని చేసినా..  ఏ ఆలోచన చేసినా అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు ఏదైనా సరే భగవంతున్ని కేంద్రంగా చేసుకుపోవాలి, అదే నిజమైన భక్తి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios